గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి

గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కోరారు.

Update: 2024-08-31 09:31 GMT

దిశ,ఉప్పల్ : గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కోరారు. ఉప్పల్ సర్కిల్ డీసీ ఆంజనేయులు అధ్యక్షతన ఉప్పల్ మున్సిపల్ కార్యాలయంలో వినాయక చవితి, నిమజ్జన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో శనివారం ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వినాయక చవితి వేడుకలు నియోజకవర్గ ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని సూచించారు.

    ఉత్స వాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఏసీపీ చక్రపాణి , ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డి, ట్రాఫిక్ సీఐ లక్ష్మిమాధవి, ఎమ్మార్వో వాణి రెడ్డి, ఈఈ నాగేందర్, కార్పొరేటర్లు బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్, బండారు శ్రీవాణి, బీఆర్ఎస్ నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News