ఓ అద్భుత కళాఖండం.. 12 వేల గంటలతో గణపతి..

వేలాది కంచు గంటలతో తయారు చేసిన వినాయక ప్రతిమ ఆకట్టుకుంటుంది.

Update: 2024-09-09 15:37 GMT

దిశ, పేట్ బషీరాబాద్ : వేలాది కంచు గంటలతో తయారు చేసిన వినాయక ప్రతిమ ఆకట్టుకుంటుంది. కుత్బుల్లాపూర్ సర్కిల్ జీడిమెట్ల డివిజన్ పేట్ బషీరాబాద్ లో ఉన్న రాయి చాందిని షాపింగ్ మాల్ లో 12వేల గంటలకు 6 మంది కళాకారులు 18 గంటలు వెచ్చించి గణపతిని రూపొందించారు. నగరానికి చెందిన కరీంగర్ అనే సంస్థ ఈ గంటల వినాయక ప్రతిమను తయారు చేసింది. ఇదే తరహాలో ముఖేష్ అంబానీ ఇంట జరిగిన వివాహ వేడుకలలో సైతం ఇదేవిధంగా గంటలతో వినాయక ప్రతిమని రూపొందించిన విషయం తెలిసిందే. తొమ్మిది రోజుల పాటు ఈ వినాయక ప్రతిమను సందర్శకుల కోసం ప్రదర్శనలో ఉంచుతామని షాపింగ్ మాల్ మేనేజర్ శ్రీకాంత్ తెలిపారు.


Similar News