యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి..

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Update: 2024-09-25 14:17 GMT

దిశ, మేడ్చల్ టౌన్ : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి వచ్చిన మల్లారెడ్డికి అర్చకులు ఘనస్వాగతం పలికారు. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని నరసింహ స్వామిని కోరుకున్నానని మల్లారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దయానంద్ యాదవ్, మేడ్చల్ మున్సిపల్ అధ్యక్షులు భాస్కర్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజమల్లారెడ్డి, భాగ్యరెడ్డి, ఒగ్గు శంకర్ తదితరులు పాల్గొన్నారు.


Similar News