డబ్బుల విషయంలో గొడవ.. వ్యక్తి దారుణ హత్య

Update: 2024-08-29 04:18 GMT

దిశ, మేడ్చల్ టౌన్ : డబ్బులు విషయం గొడువ తలెత్తడంతో కొంతమంది కలిసి ఓ వ్యక్తిని దారుణంగా చితకబాది హత్య చేశారు. ఈ సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని వినాయక నగర్ కాలనీలో రోడ్డు నంబర్ 2 లో కల్యాణ్‌ అనే వ్యక్తి ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగించేవాడు. బుధవారం రాత్రి డబ్బుల విషయంలో గొడవ జరగడంతో కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు కళ్యాణ్ ను గ్యాస్ పైపుతో కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది.


Similar News