డబ్బుల విషయంలో గొడవ.. కర్రతో దాడి.. ఒకరు మృతి

Update: 2024-08-24 14:55 GMT

దిశ, కూకట్​పల్లి : డబ్బుల విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవలో ఒకరు మృతి చెందిన సంఘటన కేపీహెచ్​బీ పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటు చేసుకుంది. కేపీహెచ్​బీ సిఐ వెంకటేశ్వర్​ రావు తెలిపిన వివరాల ప్రకారం అడ్డగుట్ట శంకర్​ విలాస్​ హోటల్​ ఎదురుగా మెదక్​ నర్సాపూర్​కు చెందిన ఎండి ఉస్మాన్​(36) అరటి పండ్ల వ్యపారం నిర్వహించుకుంటున్నాడు. అడ్డగుట్ట ఎస్​ఎస్​వి పీజీ హాస్టల్​లో పని చేస్తున్న దత్తు అలియాస్​ అశు(24) తరచు ఉస్మాన్​ పండ్ల బండి వద్దకు వచ్చి అతడి వద్ద నుంచి డబ్బులు తీసుకుని వెళుతుండే వాడు. ఈ క్రమంలో శనివారం దత్తు, ఉస్మాన్​ వద్ద నుంచి తన మొబైల్​, 400 రూపాయలు తీసుకున్నాడు. దీంతో ఉస్మాన్​ తన డబ్బులు తిరిగి ఇవ్వాలని దత్తును నిలదీశాడు. డబ్బులు ఇవ్వక పోవడంతో ఉస్మాన్​ దత్తును కొట్టాడు. దీంతో గొడవ పెరిగింది, దత్తు తిరిగి ఉస్మాన్​పై దాడికి ప్రయత్నించడంతో ఉస్మాన్​ అక్కడే ఉన్న కర్రతో దత్తు తలపై దాడి చేశాడు. దీంతో దత్తు అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. ఇదిలా ఉండగా గొడవ జరిగిన సమయంలో ఇద్దరు మధ్యం సేవించి ఉన్నారని సిఐ వెంకటేశ్వర్​ రావు తెలిపారు.


Similar News