తవ్వారు.. వదిలేశారు.. అవస్థలు పడుతున్న ప్రయాణికులు

ఉప్పల్ 117 బస్ స్టాప్ లో నడిరోడ్డు మీదనే నిల్చొని బస్సు ఎక్కాల్సిన పరిస్థితి

Update: 2024-09-27 14:45 GMT

దిశ,ఉప్పల్: ఉప్పల్ 117 బస్ స్టాప్ లో నడిరోడ్డు మీదనే నిల్చొని బస్సు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రయాణికులు ఆవేదన వెళ్లబుచ్చుతున్నారు.నెల రోజులు గడుస్తున్నా ఇంకుడు గుంత పనులు పూర్తి కాలేదు.అవస్థలు పడుతున్నమని ప్రయాణికులు అంటున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు వర్షపు నీరు వెళ్లడానికి ఇంకుడు గుంత కోసం రోడ్డును తవ్వారు.రోడ్డును తవ్వడం వల్ల బస్టాప్ లేక నిల్చోడానికి స్థలం లేక నడి రోడ్డు మీదనే నిల్చడంతో వాహనాలు మీదకు వస్తున్నాయని భయభ్రాంతులకు గురవుతున్నామని అంటున్నారు.నెల రోజులు గడుస్తున్నా పట్టించుకునే నాథుడే లేడని ప్రజల జీవితాలతో జీహెచ్ఎంసీ అధికారులు చెలగాటం ఆడుతున్నారని ఆవేదన వ్యక్తపరుస్తున్నారు.ఇప్పటికైనా ఉన్నత అధికారులు చొరవ తీసుకుని గుంతలను పూడ్చి రోడ్డు వేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.


Similar News