జన చైతన్య సేవా సమితి ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు..

జన చైతన్య సేవా సమితి ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, ఘట్కేసర్ మాజీ సర్పంచ్ అబ్బసాని యాదిగిరి యాదవ్ తెలిపారు.

Update: 2024-09-30 11:04 GMT

దిశ, ఘట్కేసర్ : జన చైతన్య సేవా సమితి ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, ఘట్కేసర్ మాజీ సర్పంచ్ అబ్బసాని యాదిగిరి యాదవ్ తెలిపారు. సోమవారం ఘట్కేసర్ పట్టణ కేంద్రంలోని గురుకుల కళాశాల మైదానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా అబ్బసాని యాదగిరి యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఏడాది నిర్వహించుకునే సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాలను ఈ సంవత్సరం యధావిధిగా నిర్వహించుకునేందుకు భారీ ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.

ఆడపడుచుల కోసం ముగ్గుల పోటీలు, మెహందీ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముల్లి జంగయ్య యాదవ్, కౌన్సిలర్లు కడపోల్ల మల్లేష్, కుతాడి రవీందర్, జన చైతన్య సేవాసమితి అధ్యక్షుడు అంకం రాజు, ప్రధాన కార్యదర్శి సార శ్రీనివాస్ గౌడ్, ఆర్గనైజర్ సెక్రెటరీ శివరాత్రి సురేష్, కేశవపట్నం ఆంజనేయులు, అబ్బసాని పొన్నయ్య యాదవ్, ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముదిరాజ్, శశిధరన్, భూషణ్ చారీ, లంబ ఆనంద్, మానుక కుమార్, తదితరులు పాల్గొన్నారు.


Similar News