ఐడిఎల్​ చెరువు కట్టపై నిమర్జన ఏర్పాట్లను పరిశీలించిన సీపీ అవినాష్​ మహంతి

కూకట్​పల్లి నియోజకవర్గంలోని ఐడీఎల్​ చెరువు కట్టను సైబరాబాద్​ సీపీ అవినాష్​ మహంతి ఆదివారం సందర్శించి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు.

Update: 2024-09-08 16:30 GMT

దిశ, కూకట్​పల్లి : కూకట్​పల్లి నియోజకవర్గంలోని ఐడీఎల్​ చెరువు కట్టను సైబరాబాద్​ సీపీ అవినాష్​ మహంతి ఆదివారం సందర్శించి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. సీపీ అవినాష్​ మహంతి వెంట బాలానగర్​ డీసీసీ సురేష్​ కుమార్​, అదనపు డీసీపి సత్యనారాయణ, ఏసీపీ శ్రీనివాస్​ రావులు పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సీపీ అవినాష్​ మహాంతి అధికారులను ఆదేశించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, నిమజ్జనానికి వచ్చే భక్తుల బధ్రతకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ కొత్తపల్లి ముత్తు, ఎస్సై రామకృష్ణ, జీహెచ్​ఎంసీ డీఈ ఆనంద్​, ఏఈ శ్రీనివాస్​ తదితరులు పాల్గొన్నారు.


Similar News