వారసులు లేని ఆస్తిని కబ్జా చేసిన బీఆర్ఎస్ నాయకులు.. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు

సూరారం శ్రీ సాయి కాలనీలో శివాలయం సమీపంలో 60

Update: 2024-09-21 14:44 GMT

దిశ, పేట్ బషీరాబాద్: సూరారం శ్రీ సాయి కాలనీలో శివాలయం సమీపంలో 60 గజాలలో దివ్యాంగులైన కాశీరాం, లక్ష్మి దంపతులు నివాసం ఉండేవారు. ఇటీవల కాలంలో తొలుత కాశీరాం, అనంతరం లక్ష్మి అనారోగ్య సమస్యలతో చనిపోవడం జరిగింది. ఈ క్రమంలో వారికి వారసులు ఎవరూ లేకపోవడంతో వారి ప్లాట్ ని బీఆర్ఎస్ నాయకులు కబ్జా చేసి ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకున్నారని సుభాష్ నగర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సోమన్న గారి శ్రీధర్ రెడ్డి కుత్బుల్లాపూర్ ఎమ్మార్వో కు ఫిర్యాదు చేశారు.

అక్రమంగా ఆస్తిని స్వాధీనం చేసుకుని దాన్ని ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకున్న వారిపై చర్యలు తీసుకొని సంబంధిత ఫ్లాట్ ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.సదరు ఫ్లాట్ ను స్వాధీనం చేసుకొని ప్రజా అవసరాల కోసం వినియోగించాల్సిందిగా కోరారు.


Similar News