దివ్యాంగుల కోసం స్కైబ్స్ రెడీ..

కూకట్ పల్లిలో గ్రూప్స్ మెయిన్స్ ప్రవేశ పరీక్ష కేంద్రాలను మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా సోమవారం సందర్శించారు.

Update: 2024-10-21 09:14 GMT

దిశ, కూకట్ పల్లి : కూకట్ పల్లిలో గ్రూప్స్ మెయిన్స్ ప్రవేశ పరీక్ష కేంద్రాలను మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా రాధిక గుప్తా మాట్లాడుతూ కూకట్ పల్లి డిగ్రీ కళాశాలలో గ్రూప్స్ మెయిన్స్ ప్రవేశ పరీక్షకు హాజరు కానున్న దివ్యాంగుల కోసం డిగ్రీ కళాశాలకు చెందిన 136 మంది విద్యార్థులు స్క్రైబ్స్ గా సిద్ధంగా ఉన్నారని అన్నారు. డిగ్రీ కళాశాలలో మొత్తం 113 మంది దివ్యాంగులు పరీక్ష రాస్తున్నారని వారి కోసం 136 మంది విద్యార్థులను స్కైబ్ గా నియమించారన్నారు. స్క్రైబ్ గా పని చేస్తున్న విద్యార్థులకు రోజు 500 రూపాయల చొప్పున పారితోషకం ఇవ్వనున్నారని తెలిపారు.


Similar News