Medak : తాగునీరు కోసం రోడ్డెక్కిన మహిళలు

మెదక్ జిల్లా రేగోడ్ మండల కేంద్రమైన అంగడి బజారులో కొన్ని రోజుల నుండి తాగు నీటి ఎద్దడి నెలకొంది.

Update: 2024-08-06 09:10 GMT

దిశ, వెబ్‌డెస్క్ : మెదక్ జిల్లా రేగోడ్ మండల కేంద్రమైన అంగడి బజారులో కొన్ని రోజుల నుండి తాగు నీటి ఎద్దడి నెలకొంది.గత 15 రోజులుగా తమ వీధిలో తాగునీటి సరఫరా జరగడం లేదని ఆందోళన చేపడుతూ మంగళవారం రోజు కొందరు మహిళలు రోడ్డెక్కి ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. తమ కాలనీలో తాగు నీరు రావడం లేనందున ఇతర కాలనీలలో ఇండ్లలోకి వెళ్లి నీరు తెచ్చుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు కొన్ని రోజుల నుండి తాగునీరు సమస్య ఉందని, ఈ విషయాన్ని పట్టించుకునే వారే కరువయ్యారన్నారు. అధికారులు గానీ నాయకులు గానీ తగు చర్యలు తీసుకోవడం లేదని రోడ్డుపైకి వచ్చి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుల తరబడి తాగు నీటిని ఇతర కాలనీల నుండి ఎలా తెచ్చుకుంటామని ప్రశ్నించారు. ఇకనైనా అధికారులు పట్టించుకోకపోతే ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని తెలిపారు. తమ సమస్యలను పరిగణలోకి తీసుకుని తాగునీరు అందించే చర్యలను వెంటనే చేపట్టాలని స్థానికులు అధికారులను కోరారు.


Similar News