శోకసముద్రంలో మునిగిన తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రి..

తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఎక్కడ చూసిన తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

Update: 2024-10-17 09:18 GMT

దిశ, తూప్రాన్ : తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఎక్కడ చూసిన తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందిన విషయం రాష్ట్రవ్యాప్తంగా అందరినీ కలిచి వేసింది. కాగా గురువారం మృతదేహాలకు పోస్టుమార్టం చేస్తున్నారు. దీనితో తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి బంధువులు గ్రామస్థులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఆసుపత్రి ఎదుట బంధువుల రోదనలతో విషాద ఛాయలు ఏర్పడ్డాయి.

భారీగా పోలీస్ బందోబస్తు..

బంధువుల గ్రామస్థులు చుట్టూ ప్రక్కల ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో డీఎస్పీ వెంకట్ రెడ్డి ఆసుపత్రి వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అనివార్య ఘటనలు కాకుండా చర్యలు తీసుకుంటున్నారు.


Similar News