కూకట్‌పల్లిలో కేరళ పోలీసుల తనిఖీలు.. సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి వద్ద ఎండీఎంఏ డ్రగ్స్‌

కేరళాకు చెందిన పోలీసులు సాయంత్రం కూకట్‌పల్లిలో తనిఖీలు నిర్వహించారు.

Update: 2024-08-31 15:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేరళాకు చెందిన పోలీసులు శనివారం కూకట్‌పల్లిలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా సినీ పరిశ్రమకు చెందిన నరసింహరాజుని అదుపులోకి తీసుకున్నారు. కాగా అతని వద్ద దాదాపు రెండున్నర కిలోలకుపైగా ఉన్న ఎండీఎంఏ డ్రగ్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు నరసింహరాజుని డ్రగ్స్‌ తయారు చేసి సినీ పరిశ్రమకు అందిస్తున్నట్లుగా పక్కా సమాచారంతో కేరళ నుంచి అతన్ని వెంబడిస్తూ వచ్చిన పోలీసులు ఈ రోజు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కాగా నింధితుడు గత కొన్నాళ్ల నుంచి డ్రగ్స్‌ తయారు చేసినట్లు గుర్తించిన పోలీసులు, ఈ డ్రగ్స్ ను ఎవరెవరికి అమ్ముతున్నారనే కోణంలో ప్రశ్నించనున్నారు.


Similar News