Dharmapuri Srinivas : డీఎస్ మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖుల సంతాపం

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు, ఉమ్మడి ఏపీ మాజీ పీసీసీ చీఫ్ డీఎస్ శనివారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో హైదరాబాద్‌లో కన్నుమూశారు.

Update: 2024-06-29 05:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు, ఉమ్మడి ఏపీ మాజీ పీసీసీ చీఫ్ డీఎస్ శనివారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో హైదరాబాద్‌లో కన్నుమూశారు. కాగా, ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. డీఎస్ మృతి పట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, జూపల్లి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీ మల్లురవి, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి, కాంగ్రెస్ నేత మధుయాష్కీగౌడ్, మాజీ మంత్రులు హారీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్‌లు సంతాపం తెలిపారు. 

Tags:    

Similar News