T PCC:కేటీఆర్ కు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్

కేటీఆర్ కు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు.

Update: 2024-09-17 07:04 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం విషయంలో చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ స్పష్టతతో ఉండాలన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారో అదే స్థానానికి ప్రజలు మిమ్మల్ని పంపుతున్నారని, మిమ్మల్ని వెనక్కి పంపడం ద్వారా తెలంగాణ ప్రజలు ఇప్పటికే తమ చాయిస్ ను ఎంచుకున్నారని విమర్శించారు. మంగళవారం ట్విట్టర్ వేదికగా పోస్టు చేసిన మహేశ్ కుమార్ గౌడ్.. రాజీవ్ గాంధీ వారసత్వం ఓ ప్రాంతానికి పరిమితం కాలేదన్నారు. అతడు ప్రతి భారతీయుడు, తెలంగాణ ప్రజల హృదయాల్లో ఉన్నారని, ఇది రాజీవ్ గాంధీ శాశ్వత ప్రభావానికి నిదర్శనం అన్నారు. నెల్సన్ మండేలా చెప్పినట్లుగా, 'జీవితంలో ముఖ్యమైనది మనం జీవించిన వాస్తవం కాదు. ఇతరుల జీవితాలకు మనం చేసిన మార్పులే మనం గడుపుతున్న జీవితం యొక్క ప్రాముఖ్యతను నిర్ణయిస్తాయి' రాజకీయ వాక్చాతుర్యంతో సంబంధం లేకుండా మన దేశం, రాష్ట్రంపై రాజీవ్ గాంధీ ప్రభావం లోతైనది మరియు శాశ్వతమైనదన్నారు.


Similar News