ఈ రోడ్డు పనులు పూర్తి చేయరా?

పట్టణంలోని శ్రీనివాసకాలనీ పంచముఖి ఆంజనేయస్వామి దేవాలయం ముందు ఉన్న రోడ్డు నిర్మాణం పనులు ఎప్పుడు పూర్తి అవుతాయని మున్సిపల్ చైర్మెన్ ఆనంద్ గౌడ్ ను కాలనీ వాసులు ప్రశ్నిస్తున్నారు.

Update: 2024-06-29 14:09 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : పట్టణంలోని శ్రీనివాసకాలనీ పంచముఖి ఆంజనేయస్వామి దేవాలయం ముందు ఉన్న రోడ్డు నిర్మాణం పనులు ఎప్పుడు పూర్తి అవుతాయని మున్సిపల్ చైర్మెన్ ఆనంద్ గౌడ్ ను కాలనీ వాసులు ప్రశ్నిస్తున్నారు. 4 నెలల క్రితం 4 ఫర్లాంగుల దూరమున్న 40 ఫీట్ల రోడ్డు పనులకు చైర్మెన్ ఆనంద్ గౌడ్ పూజలు చేసి ప్రారంభించినా కూడా పనులు మొదలు కాలేదని ఆరోపిస్తున్నారు.

పూర్తిగా ధ్వంసమైన రోడ్డు పునర్నిర్మాణం పనులకు 25 లక్షల రూపాయల నిధులు కేటాయిస్తున్నట్లు ఫిబ్రవరి 22న ప్రకటించి, పూజలు కూడా చేసి గుంతలు తొవ్వి, కంకర వేశాక ఎమ్మెల్సీ, పార్లమెంటు ఎన్నికల 'కోడ్' పేర పనులను వదిలేశారని పలువురు వాపోయారు. చిన్న పాటి వర్షానికే కుంటను తలపించేలా నీళ్ళు నిలుస్తాయని, ఈ రోడ్డును చూడగానే వాహనదారులు బెంబేలెత్తుతున్నారని, వృద్ధులు, మహిళలు, పిల్లలు కనీసం నడవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. యుద్ధ ప్రాతిపదికన రోడ్డు పనులను మొదలు పెట్టి పూర్తి చేయాలని కాలనీ వాసులు మొర పెట్టుకుంటున్నారు.

Similar News