సంవత్సరంలోపే పేరూరు లిఫ్టు పనులు పూర్తి చేస్తాం.. ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి

ఒక సంవత్సరం లోపే పేరూరు లిఫ్టు పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి తెలిపారు.

Update: 2024-07-03 13:00 GMT

దిశ, దేవరకద్ర : ఒక సంవత్సరం లోపే పేరూరు లిఫ్టు పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి తెలిపారు. బుధవారం కౌకుంట్ల మండల పరిధిలోని పేరూరు గ్రామం వద్ద ఉన్నలిఫ్ట్ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే పేరూరు పనులు పూర్తి కాలేకపోయాయని ఆయన అన్నారు. ఒక సంవత్సరంలోపే పేరూరు లిఫ్ట్ పనులు అన్ని పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని ఆయన తెలిపారు. వెంకంపల్లి అమ్మాపురం తిరుమలాపురం రేకులపల్లి పేరూరు గ్రామాల ద్వారా ఈ రైతులకు సాగునీరు అందిస్తామని ఆయన తెలిపారు. దేవరకద్ర నియోజకవర్గం సస్యశ్యామలం చేస్తామని ఆయన తెలిపారు. రైతు సంక్షేమం కోసం అన్ని విధాలా కృషి చేస్తుందని ఆయన తెలిపారు.

రైతులకు త్వరలోనే ఏకకాలపు రెండు లక్షల రుణాలు మాఫీ చేస్తామని ఆయన తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి రైతుల అభివృద్ధి కోసం అన్ని విధాల కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. రాజకీయాలకు అతీతంగా తాను అభివృద్ధి చేయడమే తన కర్తవ్యమని ఆయన అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులన్ని కూడా పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. పేరూరు లిఫ్ట్ పనులు ప్రారంభం కావడంతో మళ్ళీరైతుల కల నెరవేరుతుందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ ఆర్గనైజర్ సెక్రెటరీ అరవింద్ కుమార్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రాఘవేందర్ రెడ్డి అంజల్ రెడ్డి, వివిధ గ్రామాలకు చెందిన పార్టీ మాజీ సర్పంచులు ఎంపీటీసీలు గ్రామ కమిటీ అధ్యక్షులు అధికారులు రైతులు పాల్గొన్నారు.


Similar News