దేశ భవిష్యత్​ ఉపాధ్యాయులపైనే ఉంది

దేశ భవిష్యత్​ ఉపాధ్యాయులపై ఉందని, విద్యార్థులకు మంచి విద్య అందించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు.

Update: 2024-10-15 15:28 GMT

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్ : దేశ భవిష్యత్​ ఉపాధ్యాయులపై ఉందని, విద్యార్థులకు మంచి విద్య అందించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. మంగళవారం రాత్రి స్థానిక కలెక్టర్ కార్యాలయంలో డీఎస్సీ -2024 ఉపాధ్యాయ నియామకంలో ఎంపికైన 196 మంది అభ్యర్థులకు ఆమె ఉత్తర్వులు అందజేసి మాట్లాడారు. ఈ నియామకాల్లో కోరుకున్న చోట పోస్టింగ్ వచ్చినా రాకపోయినా విధులు క్రమశిక్షణతో నిర్వహించాలని, భవిష్యత్తు బదిలీల్లో మళ్లీ అవకాశం వస్తుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోహన్ రావు, జెడ్పీ సీఈఓ వెంకట్ రెడ్డి, డీఈఓ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News