మధనాపురం రోడ్డులో రేషన్ బియ్యం పట్టివేత...

కొత్తకోట మండల కేంద్రంలోని మధనాపురం రోడ్డులోని సాయిబాబా దేవాలయం సమీపంలో అక్రమంగా బొలెరో వాహనంలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్సై మంజునాథ రెడ్డి తెలిపారు.

Update: 2024-07-05 16:28 GMT

దిశ, కొత్తకోట : కొత్తకోట మండల కేంద్రంలోని మధనాపురం రోడ్డులోని సాయిబాబా దేవాలయం సమీపంలో అక్రమంగా బొలెరో వాహనంలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్సై మంజునాథ రెడ్డి తెలిపారు. ఎస్సై మంజునాథ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం బొలెరో వాహనంలో మధనాపురం నుంచి షాద్ నగర్ కు 40 క్వింటాళ్ల రేషన్ బియ్యం తరలిస్తున్నారని తెలిసిందన్నారు. వాహనాల తనిఖీలల్లో భాగంగా ఈ పీడీఎస్ బియ్యం పట్టుకున్నామని తెలిపారు. సివిల్ సప్లయ్ అధికారి నంద కిషోర్ పంచనామా చేసి ఫిర్యాదు ఇవ్వగా బొలెరో డ్రైవర్ పరమేశ్ తో పాటు వాహన యజమాని వడ్డె శివ పై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.


Similar News