పగలే వీధి దీపాల వెలుగులు

విద్యుత్ అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా పట్టపగలే వీధి దీపాలు వెలుగుతున్నాయి.

Update: 2024-06-29 09:15 GMT

దిశ, మాగనూర్ : విద్యుత్ అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా పట్టపగలే వీధి దీపాలు వెలుగుతున్నాయి. మాగనూర్ మండల కేంద్రంలో ఆంజనేయస్వామి టెంపుల్ దగ్గర విద్యుత్ వీధి దీపాలు నిరంతరం వెలుగుతూనే ఉన్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా వెలుగుతుండడంతో వందలాది యూనిట్ల విద్యుత్ వృధా అవుతున్నది.

దాని ఫలితంగా విద్యుత్ శాఖ గ్రామపంచాయతీలకు తీవ్రంగా నష్టం వాటిల్లుతున్నది. ఆన్ ఆఫ్ స్విచ్ బోర్డు లేక నిర్వహణ లోపం కారణంగా విద్యుత్తు వృధా అవుతుందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆన్ ఆఫ్ సిస్టంను ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

Similar News