MLA : ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలి

ప్రజలందరూ సుఖశాంతులతో ఆనందంగా జీవించాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి వినాయకుడిని ప్రార్థించారు.

Update: 2024-09-07 15:07 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: ప్రజలందరూ సుఖశాంతులతో ఆనందంగా జీవించాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి వినాయకుడిని ప్రార్థించారు. మధ్యాహ్నం 2 గంటలకు స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రతిష్టించిన మహాగణపతి కి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి మీడియాతో మాట్లాడారు. గత అనేక సంవత్సరాలుగా పట్టణంలో కుల, మత విభేదాలు మరచి వినాయక చవితిని ఘనంగా జరుపుకుంటూ, ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటూ సంతోషంగా పండుగను జరుపుకుంటున్నారని అన్నారు. నియోజకవర్గ ప్రజలే కాకుండా, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో విరాజిల్లుతూ ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ పూజలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, సిరాజ్ ఖాద్రీ, లక్ష్మణ్ యాదవ్, కృష్ణ యాదవ్, ఫయాజ్, పాషా, రాములు యాదవ్, సిజె బెనహర్,పెద్ద విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గంలోని 76 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.

వాడవాడలా ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు....

పట్టణంలో వినాయకచవితి ఉత్సవాలు శనివారం సాయంత్రం నుండి వాడవాడలా ఘనంగా నిర్వహించారు. వినాయక భవన్ లో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, గణేష్ భవన్ లో మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాత పాలమూరు, రాంనగర్, బ్రహ్మన్వాడి, బండ్లగేరి,వే పురిగేరి, వీరణ్ణ పేట, కురిహిశెట్టి కాలనీ, రాజేంద్రనగర్, న్యూ టవున్, షాషాబ్ గుట్ట,శేషాద్రి నగర్,వెంకటేశ్వర కాలనీ, పద్మావతి కాలనీ, శ్రీనివాస్ కాలనీ, ఏనుగొండ తదితర ప్రాంతాల్లో ప్రజలు భారీ వినాయక విగ్రహాలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.


Similar News