గొప్పమనసు చాటుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR

పాలకుర్తి మండలం వావిలాల గ్రామానికి చెందిన శ్రీను (33) ఇటీవల మరణించిన విషయం తెలిసిందే.

Update: 2024-07-16 03:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: పాలకుర్తి మండలం వావిలాల గ్రామానికి చెందిన శ్రీను (33) ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. పన్నెండేళ్ల క్రితం లలిత అనే మహిళతో వివాహమైంది. వీరికి ముగ్గురు(రక్షిత, రితిక, రిషిత) ఆడపిల్లల సంతానం. కూలీ పనులు చేసుకుంటూ శ్రీను కుటుంబం జీవనం కొనసాగిస్తుంది. కుటుంబానికి పెద్ద దిక్కైన తండ్రి శ్రీను ఇటీవల మరణించడంతో ముగ్గురు కుమార్తెలు విలపించిన తీరు అక్కడున్నవారిని కంటతడిపెట్టించింది. పేదకుటుంబం కావడంతో ఈ ముగ్గురు పిల్లల భవిష్యత్తు ఎలా అంటూ గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీను దహన సంస్కారాలు జరిపించడానికి ఆర్థిక స్తోమత లేకపోవడంతో గ్రాస్థుమస్థులు సోషల్ మీడియా ద్వారా విరాళాలు సేకరించి దహన సంస్కారాలు జరిపించారు. తండ్రిని కోల్పోవడంతో ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన ముగ్గురి బాలికల మోహం చూసి సోషల్ మీడియా ద్వారా ఓ కుటుంబం 50 వేల రూపాయలు అందించారు. ఈ క్రమంలో తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సహాయం చేయడానికి ముందుకొచ్చారు. ‘నా సామర్థ్యం మేరకు నేను సహాయం చేస్తాను. దయచేసి పిల్లల వివరాలు పంపించండి’ అంటూ కేటీఆర్ సోషల్ మీడియాలో తెలియజేశారు.    


Similar News