కొండా సురేఖపై పరువు నష్టం దావా కేసు.. నేడు కోర్టుకు కేటీఆర్

తెలంగాణ మంత్రి కొండా సురేఖ తనపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా కేసు వేసిన విషయం తెలిసిందే.

Update: 2024-10-23 05:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మంత్రి కొండా సురేఖ తనపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా కేసు వేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో భాగంగా ఆయన ఈ రోజు (బుధవారం) నాంపల్లి న్యాయస్థానం ముందు హాజరు కానున్నారు. ఈ క్రమంలోనే ఆయన స్టేట్‌మెంట్‌ను మేజిస్ట్రేట్ రికార్డ్ చేయనున్నారు. అయితే గత విచారణ సందర్భంగా స్టేట్‌మెంట్ రికార్డ్ చేయడానికి కేటీఆర్ కొంత సమయంలో కోరడంతో న్యాయమూర్తి కేసును ఇవాళ్టికి వాయిదా వేశారు. ఈ క్రమంలోనే నేడు కేటీఆర్ కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇవ్వనున్నారు.

ఇదిలా ఉంటే నాగార్జున కేసులోనూ కొండా సురేఖ కోర్టుకు రావల్సి ఉంది. ఆ పిటిషన్‌పై కూడా కొండా సురేఖకు కోర్టు ఇప్పటికే సమన్లు జారీ చేసింది. ఇక ఈ కేసులో నాగార్జునతో పాటు ఆయన భార్య అమల తదితరులు తమ స్టేట్‌మెంట్‌ను కూడా కోర్టులో సమర్పించారు.


Similar News