ఆ డబ్బే కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల్లో వాడింది.. మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్

రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.

Update: 2024-09-11 04:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘వాల్మీకి స్కామ్ విషయంలో తాము అన్నదే నిజమైంది. గిరిజనుల అభ్యున్నతి కోసం ఖర్చు చేయాల్సిన సొమ్మను కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి వాడింది. ఈ మొత్తం కుంభకోణంలో కాంగ్రెస్‌ నేత, కర్ణాటక మాజీ మంత్రి బి.నాగేంద్ర కీలక సూత్రధారి అని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తన చార్జిషీట్‌లో నిర్ధారించింది.

కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌‌కు చెందిన రూ.187 కోట్లు ఏకంగా కాంగ్రెస్ మంత్రి చేతుల మీదుగా దారి మళ్లాయి. ఆ సొమ్ము తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మొన్న లోక్‌సభ ఎన్నికల ఫండింగ్ కోసం ఉపయోగించింది. వాల్మీకి స్కామ్‌లో ప్రధాన నిందితుడు సత్యనారాయణ వర్మ హైదరాబాద్‌కు చెందిన బిల్డర్‌. తెలంగాణకు చెందిన ఇద్దరు కీలక కాంగ్రెస్‌ నేతలకు సత్యనారాయణ వర్మ అత్యంత సన్నిహితుడు. ఇతనికి సంబంధించిన వ్యాపారంలోనూ ఇక్కడి కాంగ్రెస్‌ నేతలు భాగస్వాములుగా ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయి. ఇంకా చాలామంది కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు అనేది నిర్వివాదం. దర్యాప్తు సంస్థలు వాల్మీకీ స్కామ్‌ నిజాలు నిగ్గుతేల్చాలి. దోషులను కఠినంగా శిక్షించాలి అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.


Similar News