రాహుల్ గాంధీతో పోచారం.. ట్విట్టర్‌లో KTR సంచలన పోస్ట్

మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం ఇటీవల కారు దిగి హస్తం పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

Update: 2024-06-25 02:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం ఇటీవల కారు దిగి హస్తం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే సోమవారం సీఎం రేవంత్ రెడ్డితో ఢిల్లీ వెళ్లిన పోచారం అక్కడ రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేను కలిశారు. తాజాగా, ఈ ఫొటోను ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన కేటీఆర్ రాహుల్ గాంధీ తీరుపై ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ ఓ చేత్తో రాజ్యాంగాన్ని పట్టుకుని.. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ను సవరించి తద్వారా ఫిరాయింపు చేసే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తామని పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. అదే రాహుల్ గాంధీ ఫిరాయింపు నిరోధక నిబంధనలకు వ్యతిరేకంగా ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ అనర్హతపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘించారన్నారు. ఇది రాజ్యాంగాన్ని రక్షించడమా లేద అపహాస్యం చేయడమా అని ప్రశ్నించారు. ఈ అంశాన్ని సుప్రీం కోర్టుకు తీసుకెళ్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. 


Similar News