KTR: నా మాటలు గుర్తుపెట్టుకో సీఎం.. మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్

సచివాలయం ఎదుట రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటుపై సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ మరోసారి ధ్వజమెత్తారు.

Update: 2024-08-20 14:13 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: సచివాలయం ఎదుట రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటుపై సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ మరోసారి ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వచ్చిన తొలిరోజే బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ సచివాలయం పరిసరాల్లోని చెత్తను తొలగిస్తామని స్పష్టం చేశారు. ‘నా మాటలు గుర్తుపెట్టుకో చీప్‌ మినిస్టర్‌’ అంటూ రేవంత్‌‌రెడ్డిని హెచ్చరించారు. మంగళవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. నీలాంటి ఢిల్లీ గులాం (బానిస) తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణను అర్థం చేసుకోలేరని రేవంత్‌పై వ్యాఖ్యలు చేశారు. చిన్నపిల్లల ముందు చెత్త మాటలు మాట్లాడిన రేవంత్ నైజం, వ్యక్తిత్వం, ఆయన పెంపకాన్ని సూచిస్తుందని మండిపడ్డారు. రేవంత్.. నీ మానసిక రుగ్మత నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News