KTR: పదేళ్ల పాటు సిరి సంపదలతో కళకళలాడిన సిరిసిల్ల మళ్లీ ఉరిసిల్లగా మారుతోంది: కేటీఆర్ ఫైర్

పదేళ్ల పాటు సిరి సంపదలతో కళకళలాడిన సిరిసిల్ల మళ్లీ ఉరిసిల్లగా మారుతోందని కేటీఆర్ కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు.

Update: 2024-09-02 06:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: పదేళ్ల పాటు సిరి సంపదలతో కళకళలాడిన సిరిసిల్ల మళ్లీ ఉరిసిల్లగా మారుతోందని కేటీఆర్ కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. నేతన్నల పట్ల కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న నేర పూరిత నిర్లక్ష్యం కార్మికుల ఉసురు తీస్తోందని ధ్వజమెత్తారు. నేతన్నల బతుకుకు భరోసా ఇచ్చే బతుకమ్మ చీరల ఆర్డర్లను నిలిపివేసి వాళ్ల పొట్ట కొట్టటం న్యాయమేనా? అని గొంతెత్తి ప్రశ్నించారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వమే వారికి ఉపాధి లేకుండా చేయటమా? ఇది ప్రజాపాలనా? ప్రజల ప్రాణాలు తీసే పాలనా? అని నిలదీశారు. సిరిసిల్ల నేతన్నలను ఆదుకోవాలని ముఖ్యమంత్రికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా మొద్దు నిద్ర నటిస్తున్నారని అన్నారు. ఇంకా ఎంతమంది ప్రాణాలు పోయేవరకు చూస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల నేతన్నలకు ఉపాధి కల్పించే చర్యలను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. మరొక్క ప్రాణం పోయినా అది ప్రభుత్వం చేసిన హత్యగానే భావించాల్సి ఉంటుందని అన్నారు. నా మీద కోపంతో నేతన్నల ప్రాణాలు బలి పెట్టవద్దు ముఖ్యమంత్రి అని చెప్పారు. వారికి మా కన్నా ఎక్కువ మంచి చేసి వారి ప్రాణాలు నిలబెట్టండని కేటీఆర్.. రేవంత్ రెడ్డికి విజ్ఙప్తి చేశారు.


Similar News