చెరువులు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోండి

భద్రాద్రి జిల్లా పరిధిలోని చెరువులను రక్షించడంతోపాటు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు కోరారు.

Update: 2024-09-21 13:19 GMT

దిశ, కొత్తగూడెం రూరల్ : భద్రాద్రి జిల్లా పరిధిలోని చెరువులను రక్షించడంతోపాటు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు కోరారు. శనివారం ఓ హోటల్​లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా చుంచుపల్లి మండల పరిధిలోని చింతలచెరువు ఆక్రమణకు గురైనట్టు తెలిపారు. చెరువు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు స్వాధీనం చేసుకొని పర్యాటక కేంద్రంగా మార్చాలని కోరారు. అదే విధంగా సింగభూపాలెం చెరువును సైతం పర్యాటక కేంద్రంగా మార్చాలన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఖమ్మంలో అనేకమంది నష్టపోయారని, వారందరినీ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా నడుస్తుందన్నారు. విలేకరుల సమావేశంలో నరేందర్ తదితరులు పాల్గొన్నారు.  

Tags:    

Similar News