టార్గెట్ బీజేపీ లీడర్స్.. రాజీనామా చేయాకుంటే చంపేస్తామని మావోయిస్టుల లేఖ

బీజేపీకి రాజీనామా చేయకపోతే చంపుతామంటూ మావోయిస్టులు బెదిరింపు లేఖలు పంపుతున్నారు.

Update: 2024-10-08 17:00 GMT

దిశ, భద్రాచలం: వరుస ఎన్కౌంటర్స్‌తో భారీగా నష్టపోయిన మావోయిస్టులు భద్రతా బలగాలను ఎదుర్కొనలేక చివరి ఆయుధంగా బీజేపీ లీడర్స్‌ని టార్గెట్ చేశారు. బీజేపీకి రాజీనామా చేయకపోతే చంపుతామంటూ బెదిరింపు లేఖలు పంపుతున్నారు. దీంతో బీజేపీ నాయకులు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఛత్తీస్‌ఘడ్ బీజాపూర్ జిల్లా, భోపాల్ పట్నం బీజేపీ మండల అధ్యక్షుడు యాలం వెంకటేశ్వర్, బిలాల్ ఖాన్‌ను ఆ పార్టీకి రాజీనామా చేయాలని మద్దెడ్ ఏరియా కమిటీ మావోయిస్టు నేత బుచ్చన్న మంగళవారం లేఖ విడుదల చేశారు. దీంతో రాజీనామా దిశగా నాయకులు అడుగులు వేస్తున్నారు. రాజీనామా చేయక పోతే ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరిక జారీ చేయడంతో బీజేపీ నేతలు ప్రాణాలు దక్కించుకునే పనిలో పడినట్లు తెలుస్తుంది.


Similar News