వరద బాధితులకు అన్నదానం

ఖమ్మం నగరంలోని మున్నేరు లోతట్టు ప్రాంతాలకు వరద రావటంతో అక్కడ ఉన్న ప్రజలు నిరాశ్రయులయ్యారు.

Update: 2024-09-08 11:32 GMT

దిశ, ఖమ్మం : ఖమ్మం నగరంలోని మున్నేరు లోతట్టు ప్రాంతాలకు వరద రావటంతో అక్కడ ఉన్న ప్రజలు నిరాశ్రయులయ్యారు. బీకే బజార్ కు చెందిన అబ్దుల్ ఖదీర్ మున్నేరు ముంపు బాధితులకు కడుపు నిండా అన్నం పెట్టేందుకు ముందుకు వచ్చారు. బీకే ప్రాంతంలో తన అనుచరులతో గత ఐదు రోజులుగా 300 మందికి అన్నం వండి ఆటో లో తరలించి అందిస్తున్నారు. ప్రతి రోజూ బగారా రైస్ తో పాటు సాంబార్, కోడిగుడ్డు అందిస్తున్నారు. ఇతను చేసే సేవా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. కరోనా సమయంలో తన సొంత డబ్బులతో ఎంతో మందికి ఆహారం అందించి ఆదర్శంగా నిలిచారు. ప్రస్తుతం ఖదీర్ చేస్తున్న అన్నదానంకు సుమారు 15 మంది యువత ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. 

Tags:    

Similar News