Mahesh Kumar Goud: ఈ స్థాయికి వస్తానని ఊహించలేదు

కాంగ్రెస్ పార్టీలో తన ప్రయాణం 1983లో ప్రారంభమైందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

Update: 2024-09-07 09:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీలో తన ప్రయాణం 1983లో ప్రారంభమైందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ స్థాయికి వస్తానని ఊహించలేదు అని అన్నారు. ఎన్‌ఎస్‌యూఐలో పనిచేయడం బాగా కలిసొచ్చిందని అభిప్రాయపడ్డారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తా అన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా తన ప్రయత్నం తాను చేస్తానని తెలిపారు. మధుయాష్కీ సేవలను ఎలా వాడుకోవాలని పార్టీ అధిష్టానానికి తెలుసు అని అన్నారు. కాగా, మహేశ్ కుమార్ గౌడ్‌ను తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమిస్తూ.. శుక్రవారం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. మహేష్​ మార్ గౌడ్.. కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో దాదాపు 38 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. 2021 నుంచి తెలంగాణ ప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించారు.


Similar News