ఉగాది శుభాకాంక్షలు చెప్పిన KCR.. రైతుల కోసం ప్రత్యేక ప్రార్థన

తెలుగు ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ కేసీఆర్ కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

Update: 2024-04-08 12:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉగాది నుండి కాలచక్రం తిరిగి మొదలు అవుతుందని, చెట్లు చిగురిస్తూ ప్రకృతిలో నూతనోత్తేజం నెలకొంటుందన్నారు. వ్యవసాయ పనులను రైతన్నలు ఉగాదినుండే ప్రారంభిస్తారని.. అందువల్ల ఉగాదిని వ్యవసాయ నామ సంవత్సరంగా పిలుచుకోవడం ప్రత్యేకత అని తెలిపారు. ప్రజల జీవితాల్లో వసంతాన్ని నింపి, క్రోధ నామ సంవత్సరంలో ప్రజలు ప్రశాంతంగా జీవించేలా దీవించాలని ప్రకృతిమాతను కేసీఆర్ ప్రార్థించారు.

Tags:    

Similar News