రామోజీరావు మృతికి సంతాపం తెలిపిన కేసీఆర్

ఈనాడు సంస్థల అధినేత, మీడియా దిగ్గజం చెరుకూరి రామోజీరావు (88) శనివారం తెల్లవారు జామున మృతి చెందారు.

Update: 2024-06-08 03:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఈనాడు సంస్థల అధినేత, మీడియా దిగ్గజం చెరుకూరి రామోజీరావు (88) శనివారం తెల్లవారు జామున మృతి చెందారు. ఆయన మృతి పట్ల బీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. పలు రంగాల్లో వ్యాపారవేత్తగా, మీడియా సంస్థల వ్యవస్థాపకుడిగా రామోజీరావు అందించిన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. శోకతప్తులైన కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.


Similar News