MLC KAVITHA: ఇంటికి చేరుకున్న కవిత.. ఫస్ట్ చేసింది ఇదే..!

నిన్న (ఆగస్టు 27)బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితక్కకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Update: 2024-08-28 14:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: నిన్న (ఆగస్టు 27)బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితక్కకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఇవాళ కవితక్క పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కేటీఆర్, హరీష్ రావులతో కలిసి హైదరాబాదు విమానాశ్రానికి చేరుకుంది. గులాబీ శ్రేణులు ఎమ్మెల్సీ కవితకు ఘనస్వాగతం పలికారు. జై తెలంగాణ అంటూ తెలంగాణ బిడ్డ కవిత నినాదాలతో మారుమోగించింది. ఐదున్నర నెలల తర్వాత తన ఇంటికి చేరుకున్న కవిత.. కుటుంబ సభ్యులను ఆత్మీయ ఆలింగనం చేసుకుంది. తల్లి శోభమ్మ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది. దీంతో కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. తర్వాత సోదరుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు రాఖీ కట్టింది. బీఆర్ఎస్ పార్టీ నేతల సమక్షంలో అన్నకు బొట్టు పెట్టి రాఖీ కట్టింది. కాళ్లకు దండం పెడుతుండగా కేటీఆర్ కవితక్కను లేపి హద్దుకున్నారు. అనంతరం స్వీట్ తినిపించుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


Similar News