దేవాలయాల అభివృద్ధికి పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాలి : శైలజ రామయ్యర్

మంథని ప్రాంతంలో దేవాలయాల అభివృద్ధికి పక్కా ప్రణాళికలు

Update: 2024-09-24 14:01 GMT

దిశ,మంథని : మంథని ప్రాంతంలో దేవాలయాల అభివృద్ధికి పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ అన్నారు.మంగళవారం దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ మంథని లోని మహా లక్ష్మి దేవాలయంలో దేవాదాయ,సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ హన్మంత రావు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.గౌతమేశ్వర దేవాలయాన్ని పురావస్తు శాఖ అధికారులతో కలిసి సందర్శించారు.అనంతరం పురపాలక కార్యాలయంలో దేవాలయాలు పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ మాట్లాడుతూ.. కాళేశ్వరం దేవాలయం,మంథని పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలను సందర్శించామని అన్నారు.కాళేశ్వరం -మంథని- రామగిరి సర్క్యూట్ ను అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు.కాళేశ్వరం దేవాలయం లోపల,పరిసరాలో అభివృద్ధి పనులు చేపట్టే భక్తులకు అవసరమైన వసతులు ఏ రకంగా కల్పించాలనే అంశం పై కాళేశ్వరంలో చర్చించామని అన్నారు.గోదావరి నది ఏ రకంగా శుభ్రం చేయాలి,పుణ్య స్నానాలు చేసేందుకు అవసరమైన షవర్, మహిళలకు స్నానాల గదుల ఏర్పాటు మొదలైన అంశాలను చర్చించామని అన్నారు.

మంథని లోని మంత్ర పూట క్షేత్రంలో బౌద్ధ కాలం జన కాలం నాటి విగ్రహాలు దొరికాయని,ఇక్కడ దేవాలయాలను సందర్శించి పెద్దలు,అర్చకులు అధికారులతో చర్చించి అభివృద్ధికి ప్రణాళిక రూపొందించడం జరుగుతుందని అన్నారు.మంథనిలోని దేవాలయాలను సంపూర్ణంగా అభివృద్ధి చేసేందుకు వచ్చే భక్తులకు కావాల్సిన సదుపాయాల కల్పన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని తెలిపారు. దేవాలయాల అభివృద్ధికి రూపొందించే ప్రణాళికల్లో స్వల్పకాలిక,దీర్ఘకాలిక ఉండాలని కమిషనర్ పేర్కొన్నారు.2027 సంవత్సరంలో గోదావరి పుష్కరాలు వస్తున్నాయని, దానికి సంబంధించి ఘాట్ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని అన్నారు.


Similar News