సిరిసిల్ల నేత కార్మికుడి మరో కళాఖండం..చేనేత మగ్గంపై సీఎం చిత్రపటం

సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్

Update: 2024-09-10 11:53 GMT

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ మరో అద్భుత కళాఖండాన్ని తయారు చేశాడు. చేనేత మగ్గంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని నేశారు. అంతేకాకుండా చేనేత వృత్తి ఉట్టిపడేలా రెండు ఫీట్ల టేకు మరమగ్గాన్ని తయారు చేసి, దానిపై మగ్గంపై చేసిన సీఎం చిత్రంతో ఉన్న వస్త్రాన్ని ఉంచి జ్ఞాపికగా తయారు చేశారు. జ్ఞాపికను రాష్ట్ర జౌళి శాఖ వారు తనతో ప్రత్యేకంగా తయారు చేయించారని, దీనిని తయారు చేయడానికి దాదాపు మూడు రోజులు శ్రమించానని హరిప్రసాద్ తెలిపారు. సీఎం చిత్రాన్ని పూర్తిగా చేతితోనే నేసినట్లు చెప్పారు. కాగా సోమవారం హైదరాబాద్ లో జరిగిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి అందజేశారు.


Similar News