Kadiam Srihari: గంట సమయం అడిగినా కేసీఆర్ ఇవ్వలేదు: కడియం శ్రీహరి

కేసీఆర్ పై కడియం శ్రీహరి విమర్శలు గుప్పించారు.

Update: 2024-10-11 12:33 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కేసీఆర్ పదేళ్లలో పరిపాలనలో విద్యా వ్యవస్థ నాశనం అయిందని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. శుక్రవారం స్టేషన్ ఘన్ పూర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన కేసీఆర్ కు పరిపాలన దక్షత లేక విశ్వవిద్యాలయాలు నాశనం అయ్యాయన్నారు. ఒక గంట సమయం కేటాయించి విద్యావ్యవస్థపై సమీక్ష చేయాలని తాను కేసీఆర్ ను అడిగినా ఆయన ఆ పని చేయలేకపోయారని విమర్శించారు. పేదలకు విద్యను అందుబాటులో ఉండే విధంగా తాము ప్రయత్నం చేస్తే కేసీఆర్ ఏ ఒక్కనాడు ఆ దిశగా ప్రయత్నం చేయలేదని, సమీక్ష నిర్వహించి మార్గదర్శకాలు ఇవ్వలేకపోయారని దుయ్యబట్టారు.  


Similar News