మహిళల మానప్రాణాలకంటే ఫర్నీచర్ ముఖ్యమా? జైనూర్ ఘటనపై బండి సంజయ్ ఆవేదన

కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో ఆదివాసీ యువతిపై షేక్ మగ్దూం అనే ఆటో డ్రైవర్ లైంగిక దాడికి ప్రయత్నించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది.

Update: 2024-09-06 08:14 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో ఆదివాసీ యువతిపై షేక్ మగ్దూం అనే ఆటో డ్రైవర్ లైంగిక దాడికి ప్రయత్నించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే జైనూర్ పట్టణంలో బుధవారం హింసాత్మక ఘటనలు జరగడంతో కర్ఫ్యూ విధించారు. ఘటనకు పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని రాజకీయ పార్టీలు, వివిధ ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తాజాగా గాంధీలో చికిత్స పొందుతున్న ఆదివాసీ మహిళను పరామర్శించారు.

ఈ క్రమంలోనే ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జైనూర్ ఘటనలో బాధితురాలిని పరామర్శించిన తర్వాత ఆమె ముఖంపై ఉన్న గాయాలను చూసి చలించిపోయానని ఆవేదన వ్యక్తంచేశారు. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ జైనూరులో దుకాణాలు దగ్దమయ్యాయని మాట్లాడటం సిగ్గు చేటన్నారు. మహిళల మాన ప్రాణాల కంటే ఫర్నీచర్ ముఖ్యమా అని ప్రశ్నించారు. ఈ విషయంపై ఎక్స్‌లో ఇవాళ ఫోటోలను పంచుకున్నారు.


Similar News