నీట్‌లో అవకతవకలు.. CM రేవంత్ రెడ్డి సంచలన డిమాండ్

నీట్ ప్రవేశ పరీక్షల్లో అవకతవకలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.

Update: 2024-06-24 16:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: నీట్ ప్రవేశ పరీక్షల్లో అవకతవకలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. నీట్ అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ సరిపోదని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్‌కు సంబంధించిన అంశం కాబట్టి బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నీట్ వ్యవహారంపై ప్రధాని మోడీ మౌనం వహించడం సరికాదన్నారు. నీట్ నిర్వహణలో కేంద్రం పూర్తిగా విఫలమైందన్నారు.


Similar News