మోడీ మూడోసారి ప్రధాని అయితే.. కాంగ్రెస్‌కు ముసళ్ల పండగే : మల్లారెడ్డి హాట్ కామెంట్స్

130 ఏళ్ల చరిత్ర అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ఇప్పుడు ఏ స్థితిలో ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-01-21 13:18 GMT

దిశ, వెబ్‌డెస్క్ : 130 ఏళ్ల చరిత్ర అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ఇప్పుడు ఏ స్థితిలో ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనను ప్రజలు ఎన్నటికి మరువలేరని అన్నారు. చరిత్రను చెప్పుకుని మనుగడ సాధించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఎద్దేవా చేశారు. దేశంలోని మొత్తం 28 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని రాష్ర్టాల్లో అధికారం ఉందో చెప్పాలన్నారు. ఒకవేళ రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చి ప్రధాని మోడీ అయితే, కాంగ్రెస్‌కు ముసళ్ల పండగేనని అన్నారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వనం వచ్చిందా.. అని విలేకరులు ప్రశ్నించగా.. తనకు ఇన్విటేషన్ అందలేదని మల్లారెడ్డి తెలిపారు.     

Tags:    

Similar News