Eatala : హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే ఉపేక్షించేది లేదు: ఈటల రాజేందర్

హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు.

Update: 2024-10-14 07:49 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ముత్యాలమ్మ గుడిపై దాడి చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఇలాంటి వ్యక్తులు, శక్తులపట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని, లేదంటే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈటల తెలిపారు. కాగా, సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ పరిధిలో ముత్యాలమ్మ గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీంతో హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ క్రమంలోనే అక్కడికి వచ్చిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్‌‌ను గో బ్యాక్ అంటూ నిరసన సెగ తగిలింది. అదేవిధంగా సంఘటన స్థలాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News