ప్రజావాణిలో ఫిర్యాదులు కరువు

ప్రజావాణిలో అందిన ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని జీ హెచ్ ఎం సీ చార్మినార్ జోన్ జోనల్ కమిషనర్ టీ. వెంకన్న తెలిపారు.

Update: 2024-09-23 09:15 GMT

దిశ, చార్మినార్ : ప్రజావాణిలో అందిన ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని జీ హెచ్ ఎం సీ చార్మినార్ జోన్ జోనల్ కమిషనర్ టీ. వెంకన్న తెలిపారు. జోనల్ కమిషనర్ వెంకన్న పర్యవేక్షణ లో చాంద్రాయణ గుట్ట నర్కి పూల్ బాగ్ లోని జోనల్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కారానికి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ వెంకన్న మాట్లాడుతూ... ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో బస్తీ, కాలనీ వాసులు స్థానికంగా నెలకొన్న సమస్యలపై ఫిర్యాదు చేయాలని సూచించారు. అందిన ఫిర్యాదులను పరిశీలించి వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ శైలజ, డిప్యూటీ డైరెక్టర్ (యూ బి డి) అమీనా బీ, టౌన్ ప్లానింగ్ సిటీ ప్లానర్ మహమ్మద్ అబ్దుల్ మజీద్, ఏ యం సీ రాజారావు, ఎలక్ట్రికల్ ఈ ఈ రామారావు , యూ బీ డి అధికారి రమేష్, బిల్ కలెక్టర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.


Similar News