సోమాలియా దేశస్థుడు మృతి..

చికిత్స కోసం సోమాలియా నుంచి వచ్చిన ఓ వ్యక్తి మృతి చెందాడు.

Update: 2023-08-06 16:10 GMT

దిశ, మెహిదీపట్నం: చికిత్స కోసం సోమాలియా నుంచి వచ్చిన ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన హుమయున్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ సైదిశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. సులేమాన్ అలీ అహ్మద్(28) అనే సొహమాలియన్ చికిత్స నిమిత్తం హైదరాబాదుకు పది రోజుల క్రితం వచ్చాడు. హుమాయ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పారా మౌంట్ కాలనీలో అద్దెకు ఉంటున్నాడు. ఆదివారం తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు అతడు ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. ప్రమాదవశాత్తు మెట్లపై నుంచి పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుకొని చికిత్స అందించారు. అక్కడే ఉన్న కొందరు అతడిని మూడో ఫ్లోర్ లో ఉన్న అతడి గదికి చేశారు. అనంతరం మధ్యాహ్నం అతన్ని గమనించగా అప్పటికే మృతి చెందాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. క్లూస్ టీమ్ ఘటన స్థలంలో నుంచి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Similar News