జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికి సమాజ్ వాది పార్టీని బలోపేతం చేస్తాం

గ్రేటర్ హైదరాబాద్‌లో వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికి సమాజ్ వాది పార్టీని మరింత బలోపేతం చేస్తామని ఆ పార్టీ నేత దండుబోయిన నిత్య కళ్యాణ్ యాదవ్ అన్నారు.

Update: 2024-10-04 14:19 GMT

దిశ, వెబ్‌డెస్క్ : గ్రేటర్ హైదరాబాద్‌లో వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికి సమాజ్ వాది పార్టీని మరింత బలోపేతం చేస్తామని ఆ పార్టీ నేత దండుబోయిన నిత్య కళ్యాణ్ యాదవ్ అన్నారు. తెలంగాణలో రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన ప్రకటించారు. సమాజ్ వాది పార్టీ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శుక్రవారం జూబ్లీహిల్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ సమాజ్ వాది పార్టీ నేత దండుబోయిన నిత్య కళ్యాణ్ యాదవ్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5లోని దుర్గా భవాని నగర్ బస్తీలో పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజ్ వాది పార్టీ ఆవిర్భావ దినోత్సవంతో పాటు దసరా పండుగ నేపథ్యంలో పేదల మధ్య వేడుకలు జరుపుకోవాలని ఉద్దేశంతో తాము 300 మంది మహిళలకు చీరలు పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. త్వరలోనే నగర వ్యాప్తంగా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఆయనతోపాటు తెలంగాణ మాదిగ దండోరా ఫౌండర్ ప్రెసిడెంట్ నర్సింగ్ రావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.


Similar News