తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ సార్ ఆశయాలను కొనసాగిద్దాం..

విశ్వకర్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ విగ్రహన్ని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని విగ్రహావిష్కరణ చేశారు.

Update: 2023-08-06 11:21 GMT

దిశ, చందానగర్: విశ్వకర్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ విగ్రహన్ని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని విగ్రహావిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జయశంకర్ సార్ జీవితాంతం తెలంగాణ కోసం పరితపించిన మహానుభావుడన్నారు.

నాలుగు కోట్ల ప్రజలలో ఉద్యమ చైతన్యాన్ని రగిలించిన తెలంగాణ సిద్ధాంతకర్త.. ఆ మహనుభావుడిని స్మరించుకుంటు ఆయన చూపిన బాటలో ప్రయాణిస్తూ ఆయన ఆశయాలను కొనసాగిద్దామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రామస్వామి యాదవ్, చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, విశ్వకర్మ ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అడ్లూరు రవీంద్ర చారి, శేర్లింగంపల్లి నియోజకవర్గ కమిటీ సభ్యులు శ్రీధర్ చారి, మల్లేష్ చారి, కృష్ణ చారి వెంకటాచారి, శ్రీనివాసచారి, మహేశ్వర చారి, మారాజు అచార్య, విఠల్ చారి, ప్రభాకర్ చారి తదితరులు పాల్గొన్నారు.


Similar News