బోనమెత్తిన గోల్కొండ కోట

ప్రఖ్యాత గోల్కొండ కోటలో ఆషాడ బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

Update: 2024-07-07 07:27 GMT

దిశ, మెహిదీపట్నం: ప్రఖ్యాత గోల్కొండ కోటలో ఆషాడ బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం ఐదున్నర గంటలకు రాష్ట్ర కుమ్మర్ల సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి గోల్కొండ కోటకు భక్తులు భారీగా తరలివచ్చారు. పోతరాజుల పూనకాలతో గోల్కొండ కోట మారుమోగుతోంది. ఈ నేపథ్యంలో గోల్కొండ కోటలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం జగదాంబికా మహంకాళి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా కోటపైకి తీసుకెళ్లనున్నారు. ఇప్పటికే వేలాదిమంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. భక్తిశ్రద్ధలతో జగదాంబికా మహంకాళి అమ్మవార్లను వేడుకుంటున్నారు.


Similar News