వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ముప్పా సుబ్బయ్య మృతి

వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ముప్పా సుబ్బయ్య మృతి చెందారు.

Update: 2024-07-07 05:27 GMT

దిశ, కూకట్ పల్లి: వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ముప్పా సుబ్బయ్య మృతి చెందారు. కూకట్ పల్లి నియోజకవర్గం కేపీహెచ్బీ కాలనీ ఆరవ ఫేజ్ సంక్షేమ సంఘం సభ్యుడిగా సుధీర్ఘ కాలం పనిచేసిన ముప్పా సుబ్బయ్య సేవా కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణకు ఎనలేని సేవలను అందించారు. వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. శనివారం రాత్రి మియాపూర్ లోని తన స్వగృహంలో అనారోగ్యంతో మృతి చెందారు. ముప్పా సుబ్బయ్య మృతి పట్ల కూకట్ పల్లి నియోజక వర్గంకు చెందిన పలువురు శ్రద్ధాంజలి ఘటించారు.


Similar News