మియాపూర్‌లో బాలుడు మిస్సింగ్

Update: 2024-10-06 08:02 GMT

దిశ, శేరిలింగంపల్లి: తొమ్మిదేళ్ల బాలుడు ఆడుకుంటూ తప్పిపోయిన ఘటన మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లాకు చెందిన మహేష్.. భార్యా పిల్లలతో కలిసి నగరానికి వలస వచ్చి మియాపూర్ న్యూ కాలనీలో నివాసం ఉంటున్నాడు. వీరి కుమారుడు లక్కీ (9) స్థానిక పాఠశాలలో చదువుకుంటున్నాడు. దసరా సెలవుల నేపథ్యంలో మియాపూర్ మెట్రో సమీపంలో ఆడుకుంటూ తప్పిపోయాడు. అబ్బాయికి చెవులు వినపడవు, మాటలు రావని పోలీసులు తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి ఆచూకీ తెలిసినవారు 8712663179, 8106679004లకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.


Similar News