HYD : ఉప్పల్ న్యూ భరత్ నగర్‌లో మహిళ మర్డర్

అనుమానాస్పద స్థితిలో మహిళా మృతి చెందిన ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

Update: 2024-07-12 05:10 GMT

దిశ, ఉప్పల్ : అనుమానాస్పద స్థితిలో మహిళా మృతి చెందిన ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్ న్యూ భరత్ నగర్‌లో ఒక ఇంట్లో గది నుండి దుర్వాసన రావడంతో స్థానికులు 100కి డయల్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకొని గది తెరిచి చూడగా కుళ్ళిన స్థితిలో మహిళ మృతదేహాన్ని గుర్తించారు. గదిలో ఒరిస్సాకు చెందిన ప్రదీప్ బోలా, మధుస్మిత (28)అనే దంపతులు కిరాయికి ఉంటున్నారు. భార్యాభర్తలకు కొన్ని రోజులుగా గొడవలు అవుతున్నాయని కోపంతోనే భర్త ప్రదీప్ బోలా భార్యను హత్య చేసి సంచిలో పెట్టి పరారయ్యాడని పోలీసులు భావిస్తున్నారు. మహిళ మృతి చెందిన సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని అన్ని కోణాల్లో విచారణ చేసి త్వరలో వివరాలు తెలియజేస్తామని ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డి తెలిపారు.


Similar News