Bandi Sanjay : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాకే హిందూ దేవాలయాలపై దాడి జరుగుతుంది

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాకే హిందువుల ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు.

Update: 2024-10-14 16:30 GMT

దిశ, బేగంపేట : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాకే హిందువుల ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. సికింద్రాబాద్ కుమ్మరిగూడ లోని ముత్యాలమ్మ గుడిని ఆయన సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… హిందూ దేవాలయాలపై దాడికి పాల్పడ్డ వ్యక్తి పిచ్చోడని పోలీసులు ముద్ర వేస్తున్నారని..ఇది కరెక్ట్ కాదన్నారు. పోలీసు వ్యవస్థపై నమ్మకం లేకుండా పోతుందన్నారు. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం తనను బాధించిందన్నారు. ఆయన వెంట కార్పొరేటర్ కొంతం దీపిక తదితరులున్నారు.


Similar News